Ap Politics:అతను నెంబర్ వన్ క్రిమినల్.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 18 |
Ap Politics:అతను నెంబర్ వన్ క్రిమినల్.. నాగబాబు సంచలన వ్యాఖ్యలు
X

దిశ, తుని: దాడిశెట్టి రాజాను నెంబర్ వన్ క్రిమినల్‌గా జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు కొణిదెల నాగబాబు అభివర్ణించారు. అంతేకాక అతను చేసే క్రిమినల్ పనులు మీ అందరికీ తెలుసని పేర్కొన్నారు. మనుషులను మర్డర్ చేయిస్తాడని బయట ప్రజలు చెబుతున్నారని తునిలో శుక్రవారం నిర్వహించిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో నాగబాబు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం జగన్, మంత్రి దాడిశెట్టి రాజాపై నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రజారాజ్యం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన బచ్చా అని, రాజకీయ భిక్ష పెట్టిందే మేమన్నారు. రారా ఏం చేసుకుంటావో చేసుకో, తాట తీసి కాళ్ళు విరగొడతా రాస్కెల్ అంటూ హెచ్చరించారు. వీడు, ఇంకొకడు కలిసి పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ని ఓడిస్తారంట అంటూ ఎద్దేవా చేశారు.

2014లో కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వం రాకూడదనే కలిసి పని చేస్తామని పేర్కొన్నారు. ఇప్పుడు జగన్ చేసినంత దుర్మార్గంగా ఏ ప్రభుత్వం పని చేయలేదని విమర్శించారు. జగన్ లాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదన్నారు. వైసీపీకి లాభం తెచ్చే పరిశ్రమలు తప్ప ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమ ఒక్కటైనా తెచ్చారా అని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వాలు మధ్యతరగతి ప్రజలనే ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. మధ్య తరగతి ప్రజలు మేల్కొని జగన్ కి బుద్ధి చెప్పాలని హితవు పలికారు.

Next Story

Most Viewed